← Back to news

రూ.20 కోసం గొడవ.. ఒకరు మృతి

By DK· 13 Jun 2026· Dishadaily· అనంతపురం జిల్లా
రూ.20 కోసం గొడవ.. ఒకరు మృతి

AP: అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో శేఖర్ అనే వ్యక్తి కూరగాయ దుకాణం నిర్వహిస్తున్నాడు. మద్యంమత్తులో ఉన్న ఇద్దరు యువకులు శేఖర్ వద్ద కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. బిల్లు రూ.120 కాగా, యువకులు రూ.500 నోటు ఇవ్వడంతో శేఖర్ రూ.380 తిరిగిచ్చాడు. ఇంకా రూ.20 ఇవ్వాలని యువకులు అడగటంతో వ్యాపారి ఇవ్వలేదు. మాటామాటా పెరిగి శేఖర్‌పై యువకులు దాడిచేశారు. గొడవపెద్దిది కావడంతో పక్కనున్న ట్యాక్సీ డ్రైవర్ బెస్త చంద్ర(55) జోక్యం చేసుకుని గొడవ ఆపాలని సర్దిచెప్పాడు. మద్యంమత్తులో ఉన్న యువకులు అతడిపై దాడిచేశారు. చంద్ర కుప్పకూలి మరణించాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.