ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు

షాద్నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఇంట్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలు మండలాలకు చెందిన మహిళా అధ్యక్షురాళ్లు, పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమణి, పిట్ట రజిత, అనసూయ, బాలమణి తదితరులు పాల్గొని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కట్టిన మహిళలకు కానుకగా రూ.50 వేల నగదుతో పాటు పట్టువస్త్రాలను అందించారు.



