గుహలో చిక్కుకుని ఆంధ్రా భక్తుడి మృతి

AP: తమిళనాడులోని అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ (36) కుటుంబంతో కలిసి స్వామివారి దర్శనం అనంతరం గిరిప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా ఇడుక్కి పిళ్లైయార్ గుహలోకి ప్రవేశించారు. ఆ గుహలోకి వెళ్లి బయటకు వస్తే కుటుంబ కష్టాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అయితే మణికుమార్ గుహలో చిక్కుకుని ఊపిరాడక స్పృహ కోల్పోయారు. స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



