కొట్టుకుపోయిన రోడ్డు.. ట్రాక్టర్లో గర్భిణి తరలింపు

TG: ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి–పెద్దగొళ్లగూడెం మధ్య ఇసుకవాగు బ్రిడ్జి వద్ద డైవెర్షన్ రోడ్డు భారీ వర్షానికి కొట్టుకుపోయింది. 25 గ్రామాల ప్రజలతో పాటు ఛత్తీస్గఢ్–తెలంగాణ రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో ప్రసవం కోసం పేరూరు ఆస్పత్రికి వచ్చిన గర్భిణి వసంతకు నొప్పులు ఎక్కువ కావడంతో ఏటూరునాగారం హాస్పిటల్కు తరలించాలని డాక్టర్స్ రిఫర్ చేశారు. రోడ్డు తెగిపోవడంతో ఉన్నతాధికారుల సలహా మేరకు కాన్పు చేశారు. అనంతరం అధికారులు ట్రాక్టర్ ఏర్పాటుచేసి వాగు ఉధృతి తక్కువగా ఉన్న ప్రాంతం నుంచి 108 అంబులెన్స్లో ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పిటల్కు పంపించారు.



