4 మెగా ఇండస్ట్రియల్ పార్కులు

TG: హైదరాబాద్ శివారులో నాలుగు కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వ భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం కింద చర్యలు వేగవంతమయ్యాయి. తొలి దశలో తిమ్మాపూర్, ఎలిమినేడు, మాదారం, దండుమైలారం ప్రాంతాల్లో పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. త్వరలో కేంద్రానికి DPR సమర్పించనున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 16 ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.



