టెర్రస్పై నుంచి దూకిన మహిళ.. అక్కడికక్కడే మృతి

TG: హైదరాబాద్ KPHBలో దారుణ ఘటన జరిగింది. పంచవటి అపార్ట్మెంట్స్లో శీతల్ (32) అనే మహిళ మృతి చెందారు. నిన్న సా. 4 గం. సమయంలో టెర్రస్పైకి వెళ్లి ఐదో ఫ్లోర్ నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. శీతల్ కొంతకాలంగా డిప్రెషన్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఆమె భర్త పోలీసులకు తెలిపారు. వీరు కేరళంలోని కన్నూర్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై KPHB పోలీసులు కేసు బుక్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



