అమర్నాథ్ లో బస్సు యాక్సిడెంట్.. 39 మందికి తీవ్ర గాయాలు!

జమ్మూకశ్మీర్లోని గందర్బల్ జిల్లా కంగన్ దగ్గర అమర్నాథ్ యాత్రికుల బస్సు యాక్సిడెంట్కు గురైంది. డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో బస్సు ఓ ఇంటిని ఢీకొట్టింది. పక్కనే ఉన్న నదిలో పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 39 మందికి గాయాలయ్యాయి. <a href="https://x.com/manojsinha_/status/2081942282987811197?s=20">ఎల్జీ మనోజ్ సిన్హా</a> స్పందిస్తూ, గాయపడిన వారికి మెరుగైన మెడికల్ ట్రీట్మెంట్ అందించాలని అధికారులను ఆదేశించారు.



