సస్పెండ్ అయిన తహసీల్దార్ ఆత్మహత్య

AP: అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో PGRS విభాగంలో పనిచేస్తున్న తహసీల్దార్ శ్రీనివాసులు గురువారం చిత్తూరు సమీపంలోని సిద్ధంపల్లె వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో లక్కిరెడ్డిపల్లి మండలంలో తహసీల్దార్గా పనిచేసిన ఆయనపై వచ్చిన అభియోగాలపై ఇటీవల ఉన్నతాధికారులు విచారణ చేసి సస్పెండ్ చేశారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



