పదేళ్ల శ్రమకు ఫలితేది?

TG : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న రేషన్ డీలర్లకు సరైన వేతనాలు చెల్లించాలని గిరిజన సంఘం నాయకుడు అప్పల నర్ష డిమాండ్ చేశారు. పాడేరు మోదకొండమ్మ ఆలయ కమ్యూనిటీ భవనంలో జరిగిన గిరిజన రేషన్ డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత చదువులు చదివి పరీక్షలు రాసి గెలిచినా, కేవలం కిలోకు రూపాయి కమిషన్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా డీలర్లకు మంచి జీతం ఇవ్వాలని తెలిపారు.




