బొగత జలపాతం వద్ద హైఅలర్ట్

TG: ములుగు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాజేడు మండలంలోని ప్రసిద్ధ బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలపాతం ప్రమాదకరంగా మారింది. దీంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఎవరూ అక్కడికి రావద్దని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జలపాతం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.



