← Back to news

ఉద్యోగం రాలేదని గోల్డ్ మెడల్ విద్యార్థి ఆత్మహత్య

By Balakrishna· 20 Jul 2026· UP
ఉద్యోగం రాలేదని గోల్డ్ మెడల్ విద్యార్థి ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో బీటెక్(ఎలక్ట్రికల్)లో గోల్డ్ మెడల్ సాధించి, రాష్ట్రంలో మూడో ర్యాంక్ సాధించిన ఆనంద్(23) ఆత్మహత్య చేసుకున్నాడు. పవర్‌గ్రిడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగం కోసం రైల్వేస్, బ్యాంకులు, SSC రిక్రూట్‌మెంట్ పరీక్షలు రాశాడు. అయినా ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపం చెందాడు. "సారీ నాన్నా..ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 సార్లు ప్రయత్నించినా సాధించలేకపోయాను. నన్ను క్షమించండి" అని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 15h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.