← Back to news

వరుస చోరీలు..పోలీసుల నిఘా ఏదీ?

By rajaratnam· 28 Aug 2026
వరుస చోరీలు..పోలీసుల నిఘా ఏదీ?

AP: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సెంటర్‌లో వరుసచోరీలు కలకలం రేపుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలోని స్టీల్‌ షాప్‌, బేకరీలో చోరీ జరిగింది. సుమారు రూ.80 వేల విలువైన వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో చోరీలు జరిగినా పోలీసులు నిఘా పెంచకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిఘా లోపం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

More in Local