← Back to news

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నాగర్‌కర్నూల్ Students

By Bhasker· 25 Aug 2026· TG
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నాగర్‌కర్నూల్ Students

TG : హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 26, 27 తేదీల్లో 12వ తెలంగాణ స్టేట్ యూత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. నాగర్‌కర్నూల్ లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ నుంచి నలుగురు ఎంపికయ్యారు. అండర్–14 ట్రయాథ్లాన్‌లో నవదీప్, అండర్–16 (600 మీటర్లు)లో గణేష్, అండర్–20 (400 మీటర్లు)లో అజయ్, అండర్–20 (3 కిమీ పరుగు)లో నవీన్ ఎంపికైనట్లు కోచ్ రానా మల్లేష్ తెలిపారు. కష్టపడి ఆడి స్టేట్ లెవెల్లో మెడల్స్ గెలిచి నేషనల్ లెవెల్‌కి వెళ్లాలని కోచ్ Students కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 23m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.