త్వరలోనే రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష?

నటి త్రిష మరోసారి తమిళనాడు వైరల్ అయ్యారు. మదురైలో కొత్తగా ఏర్పడిన ‘త్రిష వెల్ఫేర్ అసోసియేషన్’ సభ్యులు త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ నగరమంతా పోస్టర్లు అంటించారు. ‘మదురై అనేది ప్రతి రాజకీయ పార్టీ మొదలయ్యే మొదటి నేల’ అని అందులో రాశారు. ‘తమిళనాడు ప్రభుత్వం గుర్తించిన మొదటి అసోసియేషన్’ తమదే అని అందులో పేర్కొన్నారు. త్రిష సీఎం విజయ్తో తరచూ కనిపించడం, ఆయన ప్రమాణ స్వీకార వేడుకకు రావడం, ఇప్పుడు ఈ పోస్టర్లు..అన్నీ కలిసి త్రిష రాజకీయ ఎంట్రీని సూచిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.


