← Back to news

🪧 స్కూల్లో టీచర్లు లేరు..

By Anil· 25 Aug 2026· బిచ్చాల్
🪧 స్కూల్లో టీచర్లు లేరు..

TG : వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బిచ్చాల్ గ్రామంలోని ZPHS హైస్కూల్‌లో నలుగురు, MPPS స్కూల్లో ఇద్దరు టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. టీచర్ల కొరత వల్ల చదువు దెబ్బతింటోందని 150 మందికి పైగా స్టూడెంట్స్ స్కూల్ గేట్ బయట ప్రొటెస్ట్ చేశారు. MEO ఆఫీస్‌కు వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. తమ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకుని వెంటనే కొత్త టీచర్లను నియమించి, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 23m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.