స్కూల్ దగ్గర 20 కుక్కలు.. పిల్లల భద్రతకు డేంజర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్ సమీపంలోని హౌసింగ్ బోర్డు రోడ్డుపై 20కి పైగా కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. ఇదే రోడ్డుపై స్మైల్ కిడ్స్ స్కూల్ ఉండటంతో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆర్మూర్లో కుక్కల దాడి ఘటనలు జరిగాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే మున్సిపల్ అధికారులు స్పందించాలని, కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు, శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికుల డిమాండ్. వీధికుక్కల దాడుల నేపథ్యంలో పిల్లల, వృద్ధుల భద్రత గురించి సుప్రీంకోర్టు గతంలోనే హెచ్చరించిదన్నారు.

