కల్యాణలక్ష్మి కేసుపై తప్పు ఎవరిదో తేలుస్తామన్న మంత్రి పొన్నం

TG : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కల్యాణలక్ష్మి విషయంలో నాలుగైదు సార్లు అవకాశమిచ్చినా కౌంటర్ ఫైల్ చేయకపోవడంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఇందులో అధికారుల తప్పా లేక న్యాయవాదుల తప్పా అని తేలాక చర్యలు తీసుకుంటామన్నారు.



