మల్కాజిగిరిలో కాల్పుల కలకలం

TG: మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరిలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మల్కాజిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మారుతినగర్లో నిషారాణి, అరుణ్ దంపతులు నివాసముంటున్నారు. వీరి మధ్య గత కొంతకాలంగా తీవ్ర మనస్పర్థలు, విభేదాలు నడుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని నిషారాణికి అరుణ్ చెప్పాడు. ఆమెను నమ్మించి, తనతో పాటు మరో వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. అరుణ్ తన వద్ద దాచుకున్న తుపాకీతో నిషారాణిపై కాల్పులు జరిపాడు. నిషారాణి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది.



