ఇసుక ట్రాక్టర్ బోల్తా.. 25 ట్రాక్టర్లను దిగ్భందించి నిరసన

AP: చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామ పరిధిలోని పంటపొలాల వద్ద ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. అక్రమ ఇసుక రవాణా కారణంగా తమ వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని రైతులు నిరసనకు దిగారు. రైతులంతా ఏకమై 25 ఇసుక ట్రాక్టర్లను పూడి ZP హైస్కూల్ ఆవరణలో దిగ్భందించారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



