ధరణి స్కామ్లో అధికారులకు నోటీసులు

TG: ధరణి పోర్టల్లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని జరిగిన అక్రమాలపై సిట్ తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులను మార్చేసినట్లు ఇప్పటికే గుర్తించగా, ఈ అక్రమాల వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలోనే పైలట్ ప్రాతిపదికన సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో జరిగిన భూలావాదేవీలపై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించింది. సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే పలువురిని గుర్తించి నోటీసులు జారీచేశారు.



