దేవాలయంలో రీల్స్.. వివాదంగా మారిన వీడియో
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఓ యువతి రీల్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆలయ గోపురం ఎదుట పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో మొబైల్ ఫోన్లు, కెమెరాలు ఎలా అనుమతించారని, సెక్యూరిటీ సిబ్బంది ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రీల్స్ చిత్రీకరణకు కొంత సమయం పట్టిన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఆరా తీస్తున్నారు.



