← Back to news

వనపర్తిలో భారీ ధర్నా

By Ramu· 24 Aug 2026· వనపర్తి
వనపర్తిలో భారీ ధర్నా

TG : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తిలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీ ప్రకారం పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ విధానం రద్దు చేసి, వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా అకౌంట్లలో వేయాలన్నారు. సిబ్బందిని అక్రమంగా తీసేస్తున్న సర్పంచ్‌లపై చర్యలు తీసుకోవాలని, కార్మికులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, సంక్షేమ పథకాలు అందజేయాలని కోరారు.

More in Local