ఉప్పొంగిన వాగు.. విద్యార్థుల ప్రాణాలు అరచేతిలో

TG: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ (జే) గిరిజన గ్రామంలో భారీ వర్షాల కారణంగా వాగు ఉప్పొంగడంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాల ముగించుకుని ఇంటికి వెళ్తున్న చిన్నారులు వాగు దాటలేక ఒడ్డునే చిక్కుకుపోయారు. కొంతసేపటి తర్వాత నీటి ప్రవాహం తగ్గడంతో గ్రామస్తులు ఒక్కొక్కరిని సురక్షితంగా వాగు దాటించారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.



