← Back to news

దేశాన్ని కుదిపేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు

By DK· 25 Jul 2026· ఢిల్లీ
దేశాన్ని కుదిపేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు

NCRB నివేదిక ప్రకారం 2014 నుంచి 2024 వరకు దేశవ్యాప్తంగా 1,23,918 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు 80 శాతం పెరిగి, 2014లో 8,068 నుంచి 2024లో 14,488కు చేరాయి. కుటుంబ సమస్యలు ప్రధాన కారణంగా నిలవగా, పరీక్షల్లో వైఫల్యం కారణంగా 25 వేలకుపైగా మంది ప్రాణాలు తీసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. విద్యా సంస్థల్లో పెరుగుతున్న అకాడమిక్ ఒత్తిడి కూడా కీలక కారణంగా పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవగా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తదుపరి స్థానాల్లో ఉన్నాయి.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 14h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.