TRSలోకి BRS నేతలు

TG : కామారెడ్డి జిల్లా దేవాయిపల్లికి చెందిన BRS నాయకులు పులి నరేష్, బుయ్య దేవేందర్ తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో అందరినీ కలుపుకొని పోయేందుకు తెచ్చిన ‘పంచజన్యం’ ప్రోగ్రామ్ బాగుందని కొత్తగా చేరిన నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల అధ్యక్షుడు భుజంగరావు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జైల్ సింగ్, లింగంపేట్ మండల అధ్యక్షుడు పోకల సాయిరాం పాల్గొన్నారు.




