సమ్మెతో భారీగా నిలిచిన క్రయవిక్రయాలు

AP: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో ఆస్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోయాయి. సాధారణంగా రోజుకు సుమారు 10 వేల రిజిస్ట్రేషన్లు జరిగి ప్రభుత్వానికి రూ.50-60 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే సోమవారం కేవలం 500 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగి, ఆదాయం రూ.4 కోట్లకు కూడా చేరలేదు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా వ్యవస్థను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగిస్తే ఆస్తుల డేటా దుర్వినియోగం, భూముల కబ్జాలు, మోసాలు పెరిగే ప్రమాదం ఉందని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



