జార్ఖండ్లో విద్యార్థులపై వాటర్ కేనాన్ల ప్రయోగం
జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ అభ్యర్థులు ‘విధానసభ ఘేరావ్’ మార్చ్ చేస్తున్నారు. అసెంబ్లీ వైపు ర్యాలీగా కదిలిన వారు బారికేడ్లు దాటి ముట్టడి చేయాలని ప్రయత్నించగా, పోలీసులు వాటర్ కేనాన్లు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. జాతీయ జెండాలు పట్టుకుని బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లాలని విద్యార్థులు యత్నించారు. పోలీసులు-విద్యార్థుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


