జీవో 97ను వెనక్కి తీసుకోండి

హనుమకొండ జిల్లా పరకాల అంబేడ్కర్ సెంటర్లో పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లలు రోడ్డు ఎక్కి దర్నా చేశారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో నెంబర్ 97 వల్ల తమ చదువులు, భవిష్యత్తు నాశనమైపోతాయని రోడ్డుపైనే కూర్చుని నిరసన తెలిపారు. ఈ జీవో వల్ల ముఖ్యంగా పేద పిల్లలే నష్టపోతున్నారని అంటున్నారు. అంబేడ్కర్ విగ్రహం దగ్గర గట్టిగా నినాదాలు చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.





