ఫిర్యాదులో పేర్లు మాయం.. SIకి హైకోర్ట్ నోటీసులు

AP: కర్నూలు జిల్లా హొళగుంద SI దిలీప్ కుమార్కు AP హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నెరినికి గ్రామానికి చెందిన దళితుడు గిరి మల్లేష్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. కులం పేరుతో తనను దూషిస్తూ తనపై అగ్రకులాల వారు దాడి చేసి గాయపరిచారని గిరి మల్లేష్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో కొందరి పేర్లు లేకుండా చేసిన SIపై కేసు నమోదు చేయాలని గిరి మల్లేష్ హైకోర్టుకు వినతి చేశాడు. దీంతో హైకోర్టు SIకి నోటిసులు జారీ చేసింది.



