సుప్రీంకోర్టు తీర్పుతో సాగునీటి ప్రాజెక్టులకు బిగ్ రిలీఫ్

TG: తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ లాంటి సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. 2021లో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండాన్ని రద్దు చేసినా, దాని ఆధారంగా ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని తెలిపింది. ఈ తీర్పు భవిష్యత్తు ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుందని, కొత్త ప్రాజెక్టులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని చెప్పింది. తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలకు చట్టపరమైన అడ్డు ఉండదనే స్పష్టత వచ్చింది.



