← Back to news

బెంగళూరు డాక్టర్‌పై కేసు నిలిపేసిన హైకోర్టు

By RK· 30 Jul 2026
బెంగళూరు డాక్టర్‌పై కేసు నిలిపేసిన హైకోర్టు

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ఒక జంటను వేధించాడని బెంగళూరుకు చెందిన 'డాక్టర్ నాగేంద్రపై' పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణను కర్ణాటక హైకోర్టు ఆపేసింది. అసలు నిజనిజాలు తెలుసుకోకుండా పోలీసులు తొందరపడి కేసు ఎలా రాశారని కోర్టు తప్పుబట్టింది. ఒక పౌరుడు అక్రమంగా ఉంటున్న వాళ్లను గుర్తిస్తుంటే, తిరిగి అతనిపైనే కేసు పెట్టడం సరికాదని జడ్జ్ చెప్పారు. నగరంలో అక్రమంగా ఉంటున్న వాళ్లను పట్టుకుని ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విచారణను ఆగస్టు 6కు వాయిదా వేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 11h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.