ఉయ్యూరులో డయేరియా కలకలం... పారాహుషార్

ఉయ్యూరు మున్సిపాలిటీ 5,7 వార్డులో డయేరియా ప్రబలింది. ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ శుక్ర వారం ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. డయేరియా వ్యాప్తికి కారణాలు తెలు సుకునేందుకు నీటి నమూనాలను పరీక్షలకు పంపిన ట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పారు.




