మైదుకూరులో గిడుగు, ధ్యాన్చంద్కు నివాళి..

మైదుకూరు ZPHS (boys) లో శనివారం తెలుగు భాషా, క్రీడా దినోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా స్కూలు ప్రిన్సిపాల్ గోశెట్టి రామ్మోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ – "తెలుగు భాషలో ప్రావీణ్యం సాధించినప్పుడే ఇతర భాషల్లో కూడా పట్టు సాధించగలర''ని అన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, గిడుగు రామ్మూర్తి పంతులుకు ఘనంగా నివాళి అర్పించారు.

