← Back to news

చిన్నపాము అని ఆటాడితే ప్రాణం తీసింది

By డీకే· 20 Jun 2026· Eenadu· రంగారెడ్డి జిల్లా
చిన్నపాము అని ఆటాడితే ప్రాణం తీసింది

TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఖాద్రీహిల్స్‌కు చెందిన సయ్యద్ మొహిద్దీన్ హుస్సైనీ(30) వ్యాపారవేత్త. ఆయనకు మొయినాబాద్‌లో ఫాంహౌస్ ఉంది. ఆయన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. ఫాంహౌస్‌లోకి చిన్న కట్లపాము రావడంతో చేతితో పట్టుకొని మొహిద్దీన్ అందరినీ భయపెట్టాడు. పాము కుడిచేతి వేలును నోటితో గట్టిగా పట్టుకొంది. కరుస్తోందని పక్కనున్నవారు చెప్పినా తనకు ఏంకాదని చెప్పాడు. శరీరంలో మార్పులు రావడంతో మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లగా డాక్టర్స్ ఇంజక్షన్ ఇచ్చారు. తర్వాత ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లగా మొహిద్దీన్ మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు.

చిన్నపాము అని ఆటాడితే ప్రాణం తీసింది

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.