← Back to news

ఏనుగుల బీభత్సం.. తీవ్ర పంట నష్టం

By DK· 5 Jun 2026· Dishadaily· చిత్తూరు జిల్లా
ఏనుగుల బీభత్సం..  తీవ్ర పంట నష్టం

AP: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చిన్నగరిగపల్లి గ్రామ సమీపంలో జంట ఏనుగులు పొలాల్లోకి చొరబడి హల్‌చల్ చేశాయి. మామిడితోటలోకి ప్రవేశించిన ఏనుగులు చెట్ల కొమ్మలను విరిచేస్తూ తీవ్ర విధ్వంసం సృష్టించాయి. చెట్లను పెద్దఎత్తున విరిచేయడంతో చెట్లకు ఉన్న మామిడికాయలు అన్ని పూర్తిగా నేలరాలాయి. చేతికొచ్చిన పంట గజరాజుల దాడిలో నాశనమవ్వడంతో తోట యజమానితోపాటు స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఏనుగులు దాడులు చేస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

More in Local