APలో 4 కరోనా కేసులు.. ఒకరు మృతి!

APలో మళ్లీ కరోనా కలకలం. కడప జిల్లాలో 4 కోవిడ్ కేసులు నమోదవగా, ఒకరు చనిపోయారు. మరో వ్యక్తి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మిగిలిన ముగ్గురు హోం ఐసోలేషన్లో ఉన్నారు. మృతుడికి డయాబెటిస్, కిడ్నీ సమస్యలు వంటి కోమార్బిడిటీలు ఉన్నాయి. లక్షణాల ఆధారంగా ఒమిక్రాన్ వేరియంట్ అనుమానిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను NIV పుణేకు పంపగా, జిల్లా వ్యాప్తంగా నిఘాను అధికారులు పెంచారు.



