కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో గొంతుకోసి..

TG: జనగామ జిల్లాకు చెందిన రజిత, నర్సంపేట మండలానికి చెందిన అనిల్ ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉపాధి కోసం నెలరోజుల క్రితం వరంగల్ నగరానికి వచ్చి కృష్ణాకాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతుండగా, రాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన అనిల్.. భార్య రజిత చేతులు, కాళ్లు కట్టి కత్తితో మెడ కోసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.



