పర్యావరణ పరిరక్షణకు పీహెచ్డీ పరిశోధనలు అవసరం

AP: పర్యావరణ సమస్యలకు శాశ్వత పరిష్కారాల అన్వే షణలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలు కీలకమని నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.ఆర్.థోరట్ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన జాతీయ హరిత సదస్సు–2026లో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై పీహెచ్డీ పరిశోధనలు మరింత పెరగాలని సూచించారు. పర్యావరణ సమస్యలపై శాస్త్రీయ అధ్యయనాలు చేసి, వాటి ఫలితాలను విధానాల రూపకల్పనకు అనుసంధానించాలని పేర్కొన్నారు. పరిశ్రమలు కూడా పర్యావరణహిత విధా నాలను పాటించాలని APIIC డైరెక్టర్ మండలి రాజేష్ అన్నారు.

