← Back to news

హైవేపై ఘోర ప్రమాదం.. పెళ్లి ఇంట్లో తీరని శోకం

By DK· 12 Jul 2026· మార్కాపురం జిల్లా
హైవేపై ఘోర ప్రమాదం.. పెళ్లి ఇంట్లో తీరని శోకం

AP: మర్కాపురం జిల్లా కంభం సమీపంలోని అమరావతి-అనంతపురం నేషనల్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుక కోసం ఆటోలో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన బంధువులను లారీ ఢీకొట్టింది. కొందరు ఆటోలో కూర్చోగా.. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన లారీ, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతి చెందింది.

More in AP