← Back to news

కోట్లు కాజేసిన ఘరానా మోసగాడు అరెస్ట్

By DK· 23 Jul 2026· కడప జిల్లా
కోట్లు కాజేసిన ఘరానా మోసగాడు అరెస్ట్

AP: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే నెలకు 10 నుంచి 20 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి రూ.15 కోట్లు మోసం చేసిన అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని కడప రిమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి చెందిన కిచ్చా వీరభద్రరావు అలియాస్ కేవీ రావు హైదరాబాద్ కేంద్రంగా నకిలీ ట్రేడింగ్ సంస్థలు నడుపుతూ AP, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో పలువురిని మోసం చేసినట్లు తెలిపారు. కడపకు చెందిన ఇద్దరు మహిళలను రూ.55 లక్షల నమ్మించి మోసం చేసిన కేసులో అతడిని పట్టుకున్నారు. నిందితుడిపై మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 14h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.