పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్

నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసుల బలప్రయోగంపై సుప్రీంకోర్టు స్పందించింది. పోలీసుల అణచివేత చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను జూలై 27న విచారించేందుకు అంగీకరించింది. CJI జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై విచక్షణారహితంగా బలప్రయోగం జరుగుతోందని, న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై విచారణకు స్వీకరిస్తూ సోమవారం విచారణ చేపడతామని తెలిపారు.


