బొగ్గు నిల్వలపై సింగరేణి మౌనం.. దేనికి సంకేతం

TG: సింగరేణి కాలరీస్ బొగ్గు నిల్వల వ్యవహారం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సింగరేణి యాజమాన్యం చెపుతున్న లెక్కల్లోనే అవకతవకలు జరిగినట్లు స్పష్టమవుతుంది. 40లక్షల టన్నుల వ్యత్యాసంపై సూటిగా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ప్రకటించిన అధికారిక గణాంకాలే ఆరోపణలకు పునాదిగా మారాయి. 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 65.27 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా, అమ్మకం జరిగినట్లు సింగరేణి ప్రకటించింది. మిగిలిన 3.74 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాకుండానే సింగరేణి ప్రకటించిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.



