కులం పేరుతో దూషించాడనే కక్ష.. వృద్ధుడి దారుణ హత్య

AP: నెల్లూరు జిల్లాలో దారుణం.. కులం పేరుతో దూషించాడనే కక్షతో 85 ఏళ్ల వృద్ధుడిని కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన కలకలం రేపింది. కలిగిరి మండలం నాగిరెడ్డిపాలెం సెంటర్లో సంఘన రామిరెడ్డి (85)పై బక్క సంజీవ్ కుమార్ (30) కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో రామిరెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దాడి అనంతరం నిందితుడు నేరుగా కలిగిరి పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



