కవర్ను తొలగిస్తుండగా కరెంట్ షాక్.. డ్రైవర్ స్పాట్డెడ్

TG: నారాయణపేట్ జిల్లా గద్వాల్ మున్సిపాలిటీలోని దౌదర్పల్లి 7వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన కుర్వ వెంకటేష్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం గద్వాల్ నుంచి మక్తల్కు మసాలా ప్యాకెట్ల లోడ్తో వచ్చిన లారీపై కప్పిన ప్లాస్టిక్ కవర్ను తొలగిస్తుండగా కిందకు వేలాడుతున్న కరెంట్ వైర్లు తగిలాయి. కరెంట్ షాక్కు గురై వెంకటేష్(25) స్పాట్లో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్యతో పాటు నాలుగేళ్ల కుమార్తె ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



