తండ్రిని ఇనప రాడ్ తో కొట్టి చంపిన కొడుకు !

బెంగళూరులోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నేపాల్కు చెందిన ఒక వ్యక్తి తన తండ్రిని ఇనుప రాడ్తో కొట్టి చంపాడు. తండ్రీ, కొడుకులిద్దరూ వేర్వేరు అపార్టుమెంటుల్లో వాచ్ మన్లుగా పనిచేస్తున్నారు. తండ్రి చంద్ర కొత్త జాబ్ వెతుక్కుంటూ కొడుకు చేరిన అపార్టుమెంటుకి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి.కోపం పట్టలేక కొడుకు ద్రోణ తండ్రిని ఇనుప రాడ్ తో కొట్టాడు. ఆ ముసలి తండ్రి ప్రాణం అక్కడే పోయింది. సమాచారం అందుకున్న లోకల్ పోలీస్ కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



