బీజేపీ రాష్ట్రాల్లోనే పేపర్ లీక్లు: అరవింద్ కేజ్రీవాల్
పంజాబ్ ఎడ్యుకేషన్ సిస్టంను 27వ స్థానం నుంచి నెంబర్ 1కి తీసుకొచ్చాం. ఈ సక్సెస్ చూసి ఓర్వలేక బీజేపీ మా మీద పరీక్షా పేపర్స్ లీక్ అంటూ బురదజల్లుతోంది అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో 10 ఏళ్లుగా, పంజాబ్ లో మా ప్రభుత్వమే ఉన్నా ఒక్క పేపర్ లీక్ అవ్వలేదు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం వరుసగా పేపర్లు లీక్ అవుతున్నాయి. వాళ్ళ ఫెయిల్యూర్ చూసి వాళ్లే ఫ్రస్ట్రేట్ అవుతున్నారని ఆయన అన్నారు.



