ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాపై ప్రజా విచారణ

TG: జోగులాంబగద్వాల జిల్లా రాజోలి రైతువేదికలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితాపై ప్రజా విచారణ నిర్వహించారు. రాజోలి పరిధిలోని నాలుగు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలించారు. మొత్తం 93మంది వివరాలను విచారణలో పరిశీలించగా, పోలింగ్స్టేషన్ 179లో 38మంది, 180లో 12మంది, 181లో 19మంది, 182లో 24మంది ఉన్నారు. ఎంపీడీవో అబ్దుల్ సయీద్ ఖాన్, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్యతో పాటు బీఎల్ఓలు ప్రజావిచారణలో పాల్గొన్నారు. ఓటర్ల వివరాలు, అభ్యంతరాలు, సంబంధిత ఆధారాలను పరిశీలించి నమోదు చేశారు.

