← Back to news

నేషనల్ హైవేపై యాక్సిడెంట్

By dk· 9 Aug 2026· నాగర్ కర్నూల్ జిల్లా
నేషనల్ హైవేపై యాక్సిడెంట్

TG: నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కలపల్లి సమీపంలో కోదాడ-జడ్చర్ల నేషనల్ హైవేపై కారు, ట్రాలీ ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరికి తలకు తీవ్ర గాయాలు కాగా, మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కల్వకుర్తి వైపు నుంచి తెనాలికి వెళ్తున్న కారు, నిడమనూరు నుంచి పెబ్బేరు వైపు పెళ్లిచూపులకు వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.