నేషనల్ హైవేపై యాక్సిడెంట్

TG: నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కలపల్లి సమీపంలో కోదాడ-జడ్చర్ల నేషనల్ హైవేపై కారు, ట్రాలీ ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరికి తలకు తీవ్ర గాయాలు కాగా, మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కల్వకుర్తి వైపు నుంచి తెనాలికి వెళ్తున్న కారు, నిడమనూరు నుంచి పెబ్బేరు వైపు పెళ్లిచూపులకు వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



