బాసర ట్రిపుల్ ITలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

TG: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ITలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన మరోసారి తీవ్ర కలకలం రేపింది. PUC ఫస్టియర్ విద్యార్థిని అస్మితా బేగం హాస్టల్ భవనంపై నుంచి దూకింది. తీవ్ర గాయాలైన ఆమెను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని సంగారెడ్డి జిల్లా మానూరు మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన అస్మితా బేగంగా పోలీసులు గుర్తించారు. ఆమె ప్రస్తుతం బాసర ట్రిపుల్ ITలో PUC మొదటి సంవత్సరం చదువుతోంది. అస్మితా ఎవరితోనూ మాట్లాడకుండా తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నట్లు తోటి స్నేహితులు తెలిపారు.



