← Back to news

కొత్త తరహా నేరాలకు చెక్

By DK· 22 Jul 2026· విజయవాడ
కొత్త తరహా నేరాలకు చెక్

AP: రాష్ట్రంలో కొత్త తరహా నేరాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు. మారిపోతున్న నేరాల స్వభావం, ఎదుర్కోవడంలో తలెత్తుతున్న సవాళ్లు, వాటిని అధిగమించేందుకు తేవాల్సిన సంస్కరణలపై చర్చించేందుకు విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో 3 రోజులపాటు జరిగే ఈ సదస్సును ఆమె ప్రారంభించారు. సైబర్ నేరాలు, రౌడీయిజం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసింగ్‌ను సాంకేతికంగా బలోపేతం చేస్తామని తెలిపారు. నేరాల నియంత్రణలో 3P విధానం ప్రెడిక్షన్, ప్రికాషన్, ప్రివెన్షన్ అమలు చేయాలని సూచించారు.

More in AP